షాబాద్ : జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో 2021-22 సంవత్సరానికి గాను తెలంగాణ సార్వత్రిక విద్య(TOSS) ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందుటకు అపరాధ రుసుముతో ఈ 24వ తేది నుంచి అక్టొబర్ 21వరకు గడువు పొడగించిన్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుసిందర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్లో ప్రవేశ కోసం అభ్యాసకులు దరఖాస్తు ఫారంను ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ను తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం వెబ్ సైట్ www.telanganaopenscool.org ద్వారా పూర్తి చేసి డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా టి.ఎస్ ఆన్లైన్, మీసేవ ద్వారా ఫీజు చెల్లించవచ్చన్నారు.
ఫీజు ఎస్.ఎస్.సీలో అడ్మిషన్కు ఓసీ (పురుషులకు) రూ. 1100, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బాలికలకు రూ. 700, ఇంటర్మీడియట్లో అడ్మిషన్కు ఓసీ (పురుషులకు) రూ. 1300, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలకు రూ. 1100 చెల్లించాలన్నారు. అపరాధ రుసుము ఎస్.ఎస్.సికి రూ. 100, ఇంటర్మీడియట్కి రూ. 200 ఉంటుందన్నారు. మీ దగ్గర్లోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ను సంప్రదించాలన్నారు. ఇతర వివరాల కోసం ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ కె.వి సత్యనారాయణ 8008403515 నంబర్కు సంప్రదించాలని సూచించారు.