షాబాద్ : జిల్లాలో ఓపెన్ స్కూల్ 2021-22 సంవత్సరానికి గాను తెలంగాణ సార్వత్రిక విద్య(TOSS) ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ అధికారి సుసిందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 10వ తేది వరకు, అపరాధ రుసుము రూ. 100 చెల్లించి సెప్టెంబర్ 11వ నుంచి 23వ తేది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఎస్.ఎస్.సి అడ్మిషన్కు ఓసీ(పురుషులకు) రూ.1100, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మహిళాలకు రూ. 700 చెల్లించాలన్నారు. ఇంటర్మీడియట్లో అడ్మిషన్ కోసం ఓసీ (పురుషులకు) రూ. 1300, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు/మహిళలకు రూ. 1000 చెల్లించాలన్నారు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం వెబ్సైట్ www.telanganaopenschool.orgలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాల కోసం మీ దగ్గర్లోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ను, లేదా జిల్లా కో-ఆర్డినేటర్ కె.వి సత్యనారాయణ, ఫోన్ నం-8008403515కి సంప్రదించాలని తెలిపారు.