ఇబ్రహీంపట్నం : తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం మండలము కప్పపహాడ్ గ్రామానికి చెందిన విద్యార్థి నేత నిట్టు జగదీశ్వర్ నియమితులయ్యాడు. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆదివారం అధికారికంగా ప్రకటించారు.
జగదీశ్వర్ ఇంటర్ స్థాయి నుంచే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేసి విద్యార్థి నేతగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా నిట్టు జగదీశ్వర్ మాట్లాడుతూ క్రమశిక్షణ గల నేతగా టిఆర్ఎస్ పార్టీ ఆశయాలను విద్యార్థినీ, విద్యార్థుల్లోకి తీసుకెళ్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్వీ బలోపేతానికి కృషి చేస్తానని జగదీశ్వర్ అన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతం దిశగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. కాగ తన నియమకానికి కృషి చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డిలకు ఈ సందర్భంగా జగదీశ్వర్ కృతజ్ఞతలు తెలిపాడు.