శంకర్పల్లి : సనాతన ధర్మానికి నిదర్శనంగా నిలిచిన స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకొని సమాజ సేవ, ఆలయాల అభివృద్ధికి పాటుపడుతూ కరోనా కష్టకాలంలో బాధితులకు సేవలందించిన నరేష్కుమార్ (సతీష్) నేటి యువతకు ఆదర్శమని సీనీ నిర్మాతల అధ్యక్షుడు సాయివెంకట్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి వేణుగోపాల్లు పేర్కొన్నారు. బుధవారం రాత్రి నగరంలోని రవీంద్రభారతిలో మయూరీ ఆర్ట్ 29వ వార్షికోత్సవ సభలో విశ్వకళ పురస్కారాలు-2021లో భాగంగా నంది అవార్డును నరేష్కుమార్కు అందించి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భక్తి, దైవ భక్తిని ఎవరైతే అలవరుచుకుంటారో వారు సమాజంలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందుతారన్నారు. ఇలాంటి వారిని గుర్తించి ప్రొత్సహించడం వలన, వారివల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. సేవా ధృక్పథం గల వ్యక్తులు రాబోయే సమాజ భవిష్యత్కు ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దైవాజ్ఞశర్మ, మయూరి రాధ, జబర్ధాస్త్ కార్తిక్, సినీ కళాకారులు, ఆవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.