చేవెళ్ల టౌన్ : నాగుల పంచమిని పురస్కరించుకోని నియోజకవర్గంలోని వివిధ మండలల్లోని దేవాలయాలు మహిళలతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే చేవెళ్లలోని అయ్యప్ప, శివాలయం, సాయిబాబా, పోచమ్మ దేవాలయల ఆవరణలో ఉన్న పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యంగా చేవెళ్లలోని శివాలయం భక్తులతో కిటకిటలాడింది.
మొయినాబాద్ మండల కేంద్రంతో పాటు చిలుకూరు, సురంగల్, హిమాయత్నగర్, అజీజ్నగర్, కనకమామిడి, నక్కలపల్లి, తోలుకట్టా, శ్రీరాంనగర్, వెంకటాపూర్, అమ్డాపూర్, ముర్తుజాగూడ, నాగిరెడ్డిగూడ, బాకారం, చిన్నమంగళారం, ఎన్కేపల్లి, ఎతుబార్పల్లి, మేడిపల్లి తదితర గ్రామాల్లో నాగదేవతకు పూజలు చేశారు. షాబాద్ మండలంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండల పరిధిలోని కక్కులూర్, షాబాద్, నాగరగూడ, హైతాబాద్, తాళ్లపల్లి తదితర గ్రామాల్లో మహిళలు శివలయాలు, నాగుల పుట్టల వద్ద పాలు పోసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.