ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో నేలకొరిగిన వరి, మక్కజొన్న
నేలరాలిన మామిడికాయలు
కల్లాల్లో తడిసి ముద్దయినధాన్యం
పిడుగుపాటుతో పాడి గేదె మృతి
ఎల్కతుర్తి, మే 3 : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షం అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం వరి కోతకు వచ్చే సమయంలో కురిసిన వర్షంతో వడ్లు నేలరాలాయి. మరికొన్ని పంట లు నేలకొరిగాయి. ఎల్కతుర్తి, గోపాల్పూర్, వల్భాపూర్, జీల్గుల, జగన్నాథపూర్, కోతులనడుమ, దండేపల్లి, సూరారం, బావుపేట గ్రామాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. భారీగా వడ్లు నేల రాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎల్కతుర్తి తుమ్మలకుం ట వర్షానికి మత్తడి పడడం విశేషం. దెబ్బతిన్న పంటలను సోమవారం ఓసీ జేఏసీ నేత పొలాడి రామారావు పరిశీలించారు.
పిడుగుపాటుతో గేదె మృతి..
మండలంలోని పెంచికల్పేటకు చెందిన భాషవేని తిరుపతికి చెందిన పాడి గేదె ఆదివారం రాత్రి పిడుగు పడడంతో మృతి చెందింది. ఇంటి సమీపంలోని చెట్ల కింద గేదెను కట్టేసి ఉంచగా రాత్రి పిడుగు పడడంతో మృతి చెందింది. రూ. 50వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.
తడిసిన ధాన్యం..
కమలాపూర్ : మండలంలోని కమలాపూర్, ఉప్పల్, గూడూరు, కన్నూరు, మర్రిపెల్లిగూడెం, శనిగరం, అంబాల, శంభునిపల్లి, ఉప్పలపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసింది. ఈదురు గాలులకు కోతకు వచ్చిన వరి, మక్కజొన్న పంటలు నేలవాలాయి. పరకాల-హుజూరాబాద్ రహదారిపై పోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆరబెట్టేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తడిసిన ధాన్యాన్ని రైస్మిల్లుల్లో దిగుమతి చేసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు అన్నారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఈదురు గాలుల బీభత్సం..
మంగపేట : మంగపేట మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ఆయా గ్రామాల కొనుగో లు కేంద్రాల వద్ద ధాన్యం రాశుల్లో నీళ్లు నిలిచి రైతు లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రాత్రి విద్యుత్ లైన్లపై చెట్లు కూలడంతో సరఫరా నిలిచి పోగా, సోమవారం ఎన్పీడీసీఎల్ సిబ్బంది లైన్లపై పడిన చెట్లను తొలగించి సరఫరాను పునరుద్ధరించా రు. పలువురి ఇండ్లపై రేకులు గాలి బీభత్సానికి ధ్వం సమయ్యాయి. మామిడికాయలు నేలరాలాయి. ప లు గ్రామాల్లో రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికి వచ్చే తరుణంలో అకాల వర్షాలు కురిసి నష్టం వాటిల్లడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మహాముత్తారంలో..
మహాముత్తారం : మండలంలోని ఆదివారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడి న భారీ వర్షం కురిసింది. దీంతో వరి పంటలు నేల మట్టమయ్యా యి. ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. గాలి దుమారంతో మామిడికాయలు నేలరాలాయి.