చేవెళ్ల టౌన్ : చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజీత్రెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకుని పట్టణంలోని వేంకటేశ్వర ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నేతలు ఎంపీ రంజిత్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పుష్కరిణి ఆవరణలో ఎంపీ మొక్కను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్డి, టీఆర్ఎస్ చేవేళ్ల మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, పడాల ప్రభాకర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మండల పరిధిలోని పలు వివిధ గ్రామాల టీఆర్ఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.