చేవెళ్ల టౌన్ : గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎరవల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు శుక్రవారం రాత్రి దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎంపి రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుల మృత దేహలను చేవెళ్ల పరిశీలించి నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే విధంగా చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలో వాచ్మాన్గా పని చేస్తున్న వెంకటయ్య మూడు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యాదయ్య మృతుడి వెంకటయ్య కుటుంబ సభ్యులను పరమర్శించారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు ప్రభాకర్, మాణిక్య రెడ్డి, కృష్ణరెడ్డి ఉన్నారు.