మొయినాబాద్ : పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కార్యకర్తలు అంకిత భావంతో పని చేయాలని చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. మండల పరిధిలోని 28 గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన గ్రామ కమిటీలకు సంబంధించిన నివేదికను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ కమిటీలు గ్రామాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శక్తివంచనలేకుండా పని చేసే వారికి పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోనికి తీసుకెళ్లి వివరించాలని సూచించారు. పార్టీ అనుబంధ కమిటీలను కూడా పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గును గుర్తి జయవంత్, ప్రధానకార్యదర్శి నర్సింహగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, నాయకులు పరమేశ్, భిక్షపతి పాల్గొన్నారు.