శంకర్పల్లి : శంకర్పల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో శనివారం ఉదయం 10గం.లకు 6వ తరగతి విద్యార్థులకు ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులు 9గం.ల వరకు పాఠశాలకు చేరుకోవాలన్నారు. ఉదయం 10 నుంచి 12గం.ల వరకు ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుందని చెప్పారు. అలాగే 7-10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గం.ల వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రకటనలో కోరారు.