యాచారం, ఏప్రిల్ 27 : రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతువేదికలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలను పకడ్బందీగా చేపట్టిందన్నారు. ధరణీ పోర్టల్తో ఏండ్లనాటి రైతు సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతువేదికలను నిర్మించిందన్నారు. వీడియో కాన్ఫరెన్స్, మట్టి నమూనా పరీక్షలు, వివిధ శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులను నిర్వహించుకునేందుకు రైతువేదికలు దోహదపడుతాయన్నారు. మేడిపల్లి, చౌదర్పల్లి, మాల్ గ్రామాల క్లస్టర్ రైతువేదికలను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మండలంలో యాచారం, చింతపట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వి. లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, సర్పంచ్లు ముదిరెడ్డి శ్రీధర్రెడ్డి, హబీబ్, యాదమ్మ, ఎంపీటీసీలు శివలీల, ఇస్రత్బేగం, ఎంపీడీవో మమతాబాయి, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్, ఏఈ రాంసింగ్, అగ్రికల్చర్ ఏడీఏ సత్యనారాయణ, మండల వ్యవసాయాధికారి సందీప్, పీఏసీఎస్ డైరెక్టర్లు పాచ్చ బాషా, మక్కపల్లి స్వరూప, టీఆర్ఎస్ నాయకులు చిన్నోళ్ల యాదయ్య, జోగిరెడ్డి, మస్కు రమేశ్, వెంకటయ్య, ఖాజు, శివ, శ్రీనివాస్, జగదీశ్ పాల్గొన్నారు.