షాద్నగర్ : షాద్నగర్ పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, ఆడిటోరియం నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాంప్ కార్యాలయం, ఆడిటోరియం నిర్మాణ పనుల్లో ఎలాంటి నాసిరకం పనులు చేపట్టొద్దని, నాణ్యమైన పనులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మాద్, నాయకులు జూపల్లి శంకర్, శేఖర్, నర్సింహులు పాల్గొన్నారు.