వికారాబాద్ : హైదరాబాద్ ప్రగతి భవన్లో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, వీడీడీఎఫ్ వ్యవస్థాపక ప్రతినిధి శ్రీనివాస్ మార్యదపూర్వకంగా కలిశారు. ఉద్యమకారుడు వీడీడీఎఫ్ ప్రతినిధి శుభప్రద్పటేల్కు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా నియమించిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ విజయ్కుమార్, కేసీఆర్ సేవా దళం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రెడ్డి ఉన్నారు. అనంతరం సిరిసిల్ల రాత మార్చిన సరిలేని నేత రామన్నకు నీరాజనాలు అనే జనంసాక్షి స్పెషల్ డాక్యుమెంటరీ సీడీని ప్రారంభించారు.