షాద్నగర్టౌన్ : ప్రతి ఇంటికి శుద్ధమైన జలాన్ని అందించే విధంగా తెలంగాణ సర్కార్ మిషన్భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలో ఇంటింటికీ తాగునీళ్లను అందించే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు యుద్ధప్రతిపాదికన మిషన్భగీరథ పనులు కొనసాగిస్తున్నారు.
మున్సిపాలిటీలోని 28వార్డుల్లో ప్రతి ఇంటికి మిషన్భగీరథ నీళ్లను అందించడమే లక్ష్యంగా మెగా ఇంజినీరింగ్ సంస్థ, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన్ని వార్డుల్లో మిషన్భగీరథ పైపులైన్ పనులను పూర్తి చేస్తున్నారు. త్వరలోనే ట్యాంక్ నిర్మాణ పనులు పూర్తయి మిషన్భగీరథ నీళ్లు అందనున్నడంపై పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.