షాబాద్ : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదివారం రక్షాబంధన్ సందర్భంగా ఆమె సోదరుడు నర్సింహారెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్న చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని చెప్పారు. తనకు రక్షణగా ఉండాలని, అప్యాయతతో ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కడుతారన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డికి బ్రహ్మకుమారిస్ రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.