హైదరాబాద్ : నగరంలోని కొండాపూర్ దవాఖానను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. కొవిడ్ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం దవాఖానలో సౌకర్యాలపై వైద్యులు, ఆరోగ్యశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.