రాయపర్తి, ఏప్రిల్ 23: శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా మండలకేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో అనువంశిక పూజారులు ఆరుట్ల రంగాచార్యులు, వెంకటరామకృష్ణమాచార్యులు, వెంకటరమణాచార్యులు, పరాశరం వెంకటరత్నమాచార్యులు, సుదర్శనాచార్యులు, శ్రీధరాచార్యుల నేతృత్వంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి మూలవిరాట్ను ప్రత్యేకంగా అలంకరిచి చక్రస్నానోత్సవ ఘట్టాలను కనులపండువగా జరిపించారు.
బీరప్ప ఆలయంలో పూజలు
మండలంలోని కొత్తూరులో నూతనంగా నిర్మించిన బీరప్ప ఆలయాన్ని సర్పంచ్ కందికట్ల స్వామితో కలిసి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా బీరప్పకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత మందాడి సుదర్శన్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
హనుమాన్, పోచమ్మ ఆలయాల వార్షికోత్సవం
నర్సంపేట రూరల్: దాసరిపల్లిలో హనుమాన్, పోచమ్మతల్లి ఆలయాల ఆరో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ పెండ్యాల శ్రీనివాస్, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ, కారోబార్ వల్లాల అంకూస్గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులు, అర్చకుల ఆధ్వర్యంలో పోచమ్మ ఆలయంలో అమ్మవారికి పట్టువస్ర్తాలు, పంచామృతాభిషేకాలు, అర్చనలు చేశారు. అదేవిధంగా హనుమంతుడికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
రియల్ హీరో మరో సాయం.. చికిత్స కోసం ఏయిర్ అంబులెన్స్
మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టండి