షాబాద్ : షాబాద్ మండలంలోని ముద్దెంగూడలో మల్లన్న బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి భక్తులంతా గ్రామ సమీపంలోని మల్లన్న దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మహిళలు కొత్త బట్టలు ధరించి బోనాల ఊరేగింపు చేపట్టారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో జరిగే బోనాల ఉత్సవాల్లో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, యువకుల కేరింతలతో గ్రామం మార్మోగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్వ జయమ్మ, ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, ఉప సర్పంచ్ సామ ప్రతాప్రెడ్డి, సొసైటీ డైరెక్టర్ పర్వేద నర్సింహులు, మాజీ ఎంపీపీ కూర వెంకటయ్య, నాయకులు భూపతిరాజు, శ్రీనివాస్రెడ్డి, లింగం, వెంకటేశ్గౌడ్, సుదర్శన్, శంకర్ పాల్గొన్నారు.