మొయినాబాద్ : మూడు రోజులుగా ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంసెట్ పరీక్ష కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. శుక్రవారం ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంసెట్ పరీక్ష పూర్తి అయ్యింది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకుంటున్నారు.
మండల పరిధిలోని కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో, విద్యాజ్యోతి, గ్లోబల్, జేబీఐఈటీ, కెఎల్హెచ్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేబీఐఈటీలో 900మందికి 735మంది విద్యార్థులు హాజరు కాగా గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో 199మంది విద్యార్థులకు 148 మంది, కేఎల్హెచ్లో 132 మందికి 119మంది, విద్యాజ్యోతిలో 500కు 405మంది విద్యార్థులు హాజరయ్యారు.