అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని కవాడిపల్లిలో ఈ నెల 18నుంచి 27వరకు పది రోజుల పాటు లాక్డౌన్ నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ దూసరి సుజాతయాదయ్యగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు నెలరోజుల వ్యవధిలోనే కరోనా కాటుకు బలికావడం బాధకరమన్నారు. గ్రామ పెద్దలతో మంగళవారం సమవేశమై పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అందుకు గ్రామస్తులంతా సహాకరించాలన్నారు.
ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు వెసులు బాటు సమయంలో బయటకు వచ్చి వారు తప్పని సరిగా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. చేతులు శుభ్రంగా కడుక్కొని శానిటైజర్ ఉపయోగించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా లాక్డౌన్ను అతిక్రమించి తీర్మాణాన్ని ఉల్లంఘిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ యువత, యువజన సంఘాలు చొరవతీసుకొని లాక్డౌన్ నిబంధనలు పాటించి గ్రామ ప్రజల విలువైన ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామపెద్దలు తదితరులు ఉన్నారు.