చందుర్తి, మే 1: సివిల్ సర్వీసెస్ అధికారులు శిక్షణలో భాగంగా మారుమూల గ్రామమైన మూడపల్లిలో మార్చి చివరి వారంలో ఏడు రోజుల పాటు బస చేసి, పలు అంశాలపై అధ్యయనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి హర్షం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి చాలా బాగుందని, అభివృద్ధిలో సర్పంచ్, ప్రజల భాగస్వామ్యం ఎనలేనిదని కొనియాడారు. గ్రామంలో నిర్మించిన రైతువేదిక, వైకుంఠధామం, పంచాయతీ భవన నిర్మాణాలను చూసి నివ్వెరపోయారు. పట్టణ స్థాయిలో గ్రామీణాభివృద్ధి ఉందని కొనియాడారు.
సంతోషంగా ఉంది.
ట్రైనీ కలెక్టర్లు మా గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై వారంపాటు బస చేసి అధ్యయనం చేశారు. వీధుల్లో తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. రైతు వేదిక, వైకుంఠధామం నిర్మాణాలను చూసి అభినందించారు. పాఠశాలలు, ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం, వివిధ శాఖల్లో అందిస్తున్న సేవలను పరిశీలించారు. పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.