కొత్తూరు రూరల్ : ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భూమా రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన పీఆర్టీయూ టీఎస్ 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటైనా కొత్తూరు, నందిగామ మండలాల పీఆర్టీయూ టీఎస్ నూతన కార్యవర్గ సభ్యుల చేత ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, నరోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
లాక్డౌన్ కంటే ముందుతో పోలిస్తే లాక్డౌన్ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఘననీయంగా పెరిగిందన్నారు. మరింత కృషి చేస్తే కార్పొరేట్ పాఠశాలలను అధిగమించవచ్చ న్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండలాధ్యక్షుడు విజయసాగర్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కొత్తూరు ఉమ్మడి మండల పీఆర్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.