కొత్తూరు : టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొత్తూరులో ఓ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి మండల, మున్సిపల్ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. సమావేశానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం దక్కుతుందన్నారు. పదవులు రాని కార్యకర్తలు నిరాశ చెందవద్దన్నారు. పార్టీకి నిబద్ధతతో పనిచేస్తే పదవులు దానంతట అవే వస్తాయన్నారు. మరో రెండేండ్లలో ఎన్నికలు ఉన్నాయని అందుకోసం ఇప్పటి నుంచే పనిచేయాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో ఎవరికో ఒకరికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడిగా మెండె కృష్ణ
టీఆర్ఎస్ కొత్తూరు మండలాధ్యక్షుడిగా మెండె కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే మున్సిపాలిటీ అధ్యక్షురాలిగా కొస్గి భగవద్గీతను ఎన్నుకున్నారు. మున్సిపాలిటీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కుమ్మరి రమాదేవి, యువజన విభాగం మండలాధ్యక్షుడిగా కడల శ్రీశైలంను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువా కప్పి సత్కరించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ వారిచే ప్రమాణం చేయించారు. కొత్తూరు మండల పరిధిలోని మల్లాపూర్ గ్రామ కమిటీని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంటనోళ్ల యాదగిరి ఆధ్వర్యంలో కుమ్మర జయేందర్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ డోలి రవీందర్, టీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, దేవేందర్యాదవ్, మామిడి శ్యాంసుందర్రెడ్డి, జనార్దన్రెడ్డి, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు యాదగిరి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.