కొడంగల్ : పట్టణంలో నిర్మాణంలో ఉన్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తనిఖీ చేసి పనుల పురోగతిపై ఆరా తీశారు. నత్త నడకన కొనసాగుతున్న నిర్మాణపు పనులపై అదనపు కలెక్టర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. నెల రోజుల్లోపు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. పూర్తి స్థాయిలో నిధులు మంజూరు అయినప్పటికీ నిర్మాణం పనులు పూర్తి కాకపోవడం పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో డా. వీణ, మున్సిపల్ కమిషనర్ నాగరాజుతో పాటు పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.