కడ్తాల్ : చరికొండ సమీపంలోని ఖిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చరికొండ గ్రామంలోని పురాతన ఖిల్లాని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. చరికొండ గ్రామానికి అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో దాదాపు మూడు కిలోమీటర్ల లోపల ఉన్న చరికొండ ఖిల్లాకు ఎమ్మెల్యే కాలినడకన వెళ్లి సందర్శించారు. ఈ సందర్భంగా కొండ పైన ఉన్న ఖిల్లాతోపాటు ఆలయాలను, పురాతన బావులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చరికొండ ఖిల్లా వద్ద పురాతన కట్టడాలు, స్థూపాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఖిల్లా అభివృద్ధికి తన పూర్తి సహకరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఖిల్లా పరిసరాలలో ఎంతో ఆహ్లాదరకరమైన వాతావరణం ఉన్నదని, ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ధేందుకు నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తానని చెప్పారు. అంతకముందు పురాతన ఆలయాల వద్ద ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, సీఐ ఉపేందర్, ఎస్ఐ హరిశంకర్గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పరమేశ్, మండల కో-ఆర్డినేటర్ వీరయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, భారతమ్మ, లోకేశ్నాయక్, యాదయ్య, ఉప సర్పంచ్ నరేశ్, ఆర్ఐ సురేందర్, ఎంపీవో తేజ్సింగ్, నాయకులు నర్సింహాగౌడ్, గంప శ్రీను, రమేశ్రెడ్డి, జంగయ్యగౌడ్, నరేశ్గౌడ్ పాల్గొన్నారు.