కడ్తాల్ : మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు భాస్కర్రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి డివైడర్పై భాస్కర్రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పర్యావరణ పరీరక్షణ మనందరి బాధ్యత అని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
పుట్టినరోజు జరుపుకునే వారు తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, హన్మానాయక్, వేణుగోపాల్, జహంగీర్అలీ, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, బిక్కునాయక్, రవీందర్రెడ్డి, నరేశ్నాయక్, కృష్ణ పాల్గొన్నారు.