కడ్తాల్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నిత్య పూజలు నిర్వహించాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకోని గంప లక్ష్మయ్య ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్ సమకూర్చిన, మట్టి వినాయకులను గురువారం మండల కేంద్రంలో భక్తులకు పంపిణీ చేశారు. వినాయకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ హాజరై మాట్లాడారు. రసాయన విగ్రహాలను చెరువులు, కుంటల్లో వేయడంతో అవి కరిగేందుకు నెలల తరబడి సమయం పట్టడమే కాక నీరంతా కలిషితమవుతుందన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని కోరారు.
ఆరేండ్లుగా కడ్తాల్ మండలంలో మట్టి వినాయకులను భక్తులకు అందజేస్తున్న వెంకటేశ్గుప్తాను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం 500 మట్టి విగ్రహాలతో పాటు మొక్కలను ఉచితంగా భక్తులకు అందజేశారు. అంతకుముందు మైసిగండి గ్రామానికి చెందిన రాముగౌడ్కు మంజూరైన రూ. 56వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును లబ్ధిదారుడికి ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జహంగీర్అలీ, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి, సర్పంచ్లు తులసీరాంనాయక్, కృష్ణయ్య, యాదయ్య, ఎంపీటీసీలు శ్రీనివాస్రెడ్డి, లచ్చిరాంనాయక్, గోపాల్, ఉప సర్పంచ్లు రామకృష్ణ, వినోద్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ వీరయ్య, నాయకులు గంప శ్రీను, జహంగీర్అలీ, లక్పతినాయక్, లాయక్అలీ, భిక్షపతి, మహేశ్, మల్లయ్య, రాఘవేందర్, రాముగుప్తా, కరుణకర్గుప్తా, వీరేంద్రగుప్తా, ఇర్షాద్, అంజి పాల్గొన్నారు.