కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలందరికి వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన యాదమ్మకి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 2 లక్షలు (ఎల్వోసీ) చెక్కు మంజూరు అయింది. ఆదివారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో లబ్ధిదారురాలి కుటుంబ సభ్యుడికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదలకు కార్పొరేట్ దవఖానల్లో వైద్యం అందుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, హన్మా నాయక్, సుమన్గౌడ్, రాజు, విజయ్రాథోడ్, ఖుద్దుస్ పాల్గొన్నారు.