కడ్తాల్ : మండలంలో టీఆర్ఎస్ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే సమక్షంలో తన నివాసంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా గుర్కా రాజేందర్యాదవ్, మండల యువజన విభాగం అధ్యక్షుడిగా మహ్మద్ ఇర్షాద్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా సిద్ధమోని నరేశ్గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్గా అండేకార్ సాయికుమార్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు, తండాలలో పార్టీ బలోపేతానికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి పదవులు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం మండల అధ్యక్షుడు పరమేశ్తోపాటు అనుబంధ కమిటీల అధ్యక్షులను ఎమ్మెల్యే శాలువాలు, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్ గుప్తా, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మహేశ్, నాయకులు నరేందర్, శ్రీనివాస్, మహేశ్గౌడ్, హరీశ్గౌడ్, అంజి పాల్గొన్నారు.