ఆమనగల్లు : ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన మహోన్నతమైన వ్యక్తి ప్రొపెసర్ జయశంకర్ సార్ అని నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన సేవాలను కొనియాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రుల వివక్షత, దోపీడీకి చరమగీతం పాడాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రసాధనే ఏకైక లక్ష్యం అని ఉద్యమానికి నాంది పలికాడు.
కడ్తాల్ : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో జయశంకర్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జయశంకర్సార్ చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ ఆశయాల ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని పేర్కొన్నారు.