టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వానికి, ప్రజల మధ్య మధ్యవర్తులు ఉండరని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తీసుకొచ్చిన ప్రతి పథకం నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటూ నకిరేకల్లో శనివారం ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితక్కెళ్లపల్లి రవీందర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్తో కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పథకాలు కొందరికే చేరేవని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే తరతమ భేదం లేకుండా అర్హులందరికీ అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు బాగోగులు తెలిసిన సీఎం కేసీఆర్తోనే సంక్షేమం, అభివృద్ధి పరుగులు సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లోటీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 4వ, 19వ, 20వ వార్డుల్లో పాల్గొని అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో మంత్రి మాట్లాడుతూ అనేక విప్లవాత్మక పథకాలను ప్రజలకు అందించి దేశంలో తెలంగాణను నంబర్వన్ రాష్ట్రంగా నిలబెట్టిన సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అన్నారు. అభివృద్ధికి తూట్లు పొడిచే విధంగా విపక్ష నేతలు అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలు అయోమయానికి గురికావద్దని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో నకిరేకల్ను అభివృద్ధిలో ముందుంచడమే లక్ష్యమన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మాత్రమే ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారానే పథకాలు ప్రజలకు నేరుగా చేరడంతోపాటు నకిరేకల్ పట్టణం అన్నిరంగాల్లో అభిదృద్ధి చెందుతుందన్నారు. 20వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఆయా వార్డుల అభ్యర్థులు చౌగోని రాములమ్మాసైదులు, యల్లపురెడ్డి శిరీషాసైదిరెడ్డి, రాజకొండ శ్రీను, ఇన్చార్జీలు, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, నూక సైదులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. రూ. 8కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే పట్టణంలో 90శాతం పనులను పూర్తయ్యాయని మిగతా పెండింగ్ పనులను మున్సిపల్ ఎన్నికల అనంతరం పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం 3వ, 11వ వార్డు అభ్యర్థులు పొడుగు స్వాతి, మురారిశెట్టి ఉమారాణికృష్ణమూర్తి తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నడికుడి ఉమారాణి, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్, తరాల బలరాములు, నార్కట్పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి,మల్లికార్జున్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నడికుడి వెంకటేశ్వర్లు, అంతటి శ్రీను, నర్సింగ్ శ్రీనివాస్, నర్సిరెడ్డ్డి పాల్గొన్నారు.
నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 11వ వార్డు అభ్యర్థి మురారిశెట్టి ఉమారాణీ కృష్ణమూర్తిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి జరుగాలంటే కేసీఆర్, కేటీఆర్,మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోను సాధ్యమవుతుందని, అందుకు కారుగుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో ఐతగోని వెంకన్నగౌడ్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.