పెద్దఅంబర్పేట : ప్రభుత్వం నుంచి అందుతున్న నిత్యావసర సరుకులు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని అంగన్వాడీ సెంటర్లు, చౌకధార దుకాణాలను ఫుడ్ కమిషన్ సభ్యులు సందర్శించారు. కేంద్రాల్లో నిత్యావసర సరుకుల పట్టికను ఏర్పాటు చేయాలని, ఫిర్యాదుల బాక్స్ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యుడు గోవర్ధన్రెడ్డి అన్నారు. శనివారం మున్సిపాల్టీలోని కుంట్లూర్లోని ప్రభుత్వ చౌకధార దుకాణాలను, తట్టిఅన్నారంలోని అంగన్వాడీ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. నెల వారిగా అందుతున్న సరుకుల వివరాలను బోర్డులో ఉంచాలని, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సెంటర్లను తనిఖీ చేయాలని సూచించారు.
బాలింతలకు, గర్భిణులకు ప్రభుత్వం నుంచి అందుతున్న పొషక ఆహార పదార్ధాలను విధిగా అందించాలని, అంగన్వాడీ స్కూల్లోని గర్భిణి మహిళలను ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు అయ్యే విధంగా చూడాలని ఆశ వర్కర్లకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ హైదర్ ఆలీ, సీపీడీవో వినిత పాల్గొన్నారు.