ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్ జడ్జిగా ఇందిర గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన ఇందిరకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్, న్యాయవాదులు వెంకటేషం, జైపాల్, శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, జగన్, అంజన్రెడ్డి, మహేందర్, రవికిరణ్, ధనుంజయ్తో పాటు పలువురు పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు.