ఎవరి భూమి వారికి ఉండడానికి, రైతుబంధు, రైతుబీమా రావడానికి, రిజిస్ట్రేషన్ గోస తీరడానికి, ధాన్యం పైసలు
రావడానికి ధరణి వెబ్సైట్ పుణ్యమేనని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణితో రైతుల గోస తీరిందని తెలిపారు. శుక్రవారం
మంచిర్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సింగరేణి మైనింగ్లో వజ్రపు
తునక అని, దీన్ని కాంగ్రెస్ సగం చంపితే, మిగతా సగం చంపేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని అన్నారు.
తాను హైదరాబాద్లో రైతుబంధు పైసలు వేస్తే.. డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో జమవుతున్నాయని, ధరణి లేకపోతే ఇవన్నీ అయ్యేవి కావని స్పష్టం చేశారు. ధరణిపై తప్పుడు ఆరోపణలు చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అంతకుముందు కొత్త కలెక్టరేట్ భవనం, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే గృహలక్ష్మి, కుల వృత్తులకు ఆర్థిక సాయం పథకాలతో పాటు రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.