రంగారెడ్డి : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు నిస్వార్థంగా ఓటు వేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరుఫున స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్తో కలసి ముమ్మర ప్రచారం నిర్వహించారు.
మున్సిపల్ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ 5వ వార్డు అభ్యర్థి హైమావతి నర్సింహ గౌడ్, 6వ వార్డ్ అభ్యర్థి సరస్వతి వెంకటేష్, 7వ వార్డు అభ్యర్థి జంగమ్మ జనార్దన్ చారి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికి తిరిగి ఓటర్లను కలసి ప్రచారం నిర్వహించారు.
మహిళలు, యువకులు స్వచ్చందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రచారం పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మంత్రి వివరించారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లక్ష పుష్పార్చన