ఇబ్రహీంపట్నం : పేద ప్రజల వైద్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భరోసానిస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన రమావత్ మోతీరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అతని చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుంచి ఎల్వోసీ ద్వారా రూ. 4లక్షలను మంజూరు చేయించారు. అట్టి చెక్కును గురువారం క్యాంపు కార్యాలయంలో అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.
అలాగే, ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన ఎల్లంకి విజయ్కు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 43వేల సహాయనిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల ద్వారా దవాఖానలో డబ్బులు చెల్లించలేని పేద ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, ఎంపీపీ కృపేష్, సర్పంచులు బల్వంత్రెడ్డి, జగదీష్, జయలక్ష్మీ, కిషన్నాయక్, మండల అధ్యక్షుడు బుగ్గరాములు, మండల ప్రధాన కార్యదర్శులు భాస్కర్రెడ్డి, నాయకులు పరికిషన్రెడ్డి, జంగయ్య, కొండల్ పాల్గొన్నారు.