మంచాల : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వానతో వాగులు, వంకలు వరద నీటితో పొంగి పోర్లుతున్నాయి. మంగళవారం మండలంలోని సలిగుట్ట తండాలోని ఇండ్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. తండాలో ఎటు చూసిన నీటి ప్రవాహంతో దర్శనిమిస్తున్నాయి. అదే విధంగా లోయపల్లి సమీపంలో ఉన్న ధర్మాయ చెరువు నిండి అలుగు పారతోంది. గుట్టలపై నుంచి వస్తున్న నీటి ప్రవాహనికి లోయపల్లిలోని కొన్ని ఇండ్లల్లోకి నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో వర్షాలకు చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది.