మొయినాబాద్ : రెండు రోజులుగా జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయమవుతు న్నాయి. మొయినాబాద్ మండలలంలో శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురువగా శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జోరుగా కురిసాయి. రోడ్ల మీదకు వరద నీరు రావడంతో రోడ్లు వరద నీటితో దర్శనం ఇచ్చాయి. శనివారం మధ్యాహ్నం నుంచి ఏక దాటిగా వర్షం కురవడంతో ప్రజల పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనకమామిడి గేట్ వద్ద సాయంత్రం కురిసిన వర్షానికి హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి జలమయమైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.