నల్లగొండ : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కడుతూ ప్రజలు టీఆర్ఎస్ను దీవించారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంత్రి జగదీష్ రెడ్డిని కలిశారు. వారికి మంత్రి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఆక్సిజన్ మిగులు నిల్వల ఏర్పాటు : కేంద్రానికి సుప్రీం ఆదేశం