మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 38మంది విద్యార్థులకు గాను 30మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో ఏ. శివకుమార్ (80.184), బి. భరత్ (84.963), ఈ. శ్రీకాంత్ (82.713), జీ. మహేశ్ (80.042), కె. గణేష్ (83.591), ఎన్. నేతాజీ (84.934) అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వీరు మరింత అత్యుత్తమ ఫలితాలు సాధించాడానికి, చిలుకూరు కళాశాల ఖ్యాతిని పెంచడానికి కృషి చేస్తామని కళాశాలల ప్రిన్సిపాల్ పాపారావు తెలిపారు. జేఈఈ మెయిన్స్లో ఫలితాలను సాధించిన విద్యార్థులను హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల ప్రాంతీయ సమన్వయాధికారి డాక్టర్ శారధావెంకటేష్ అభినందించారు.