తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన పద్మమ్మ ఆనారోగ్యానికి గురయ్యారు. వైద్యం కోసం బాధితురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్సీ బాధితురాలి కుటుంబ సభ్యుల చేత ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ప్రకాష్కు రూ. 60వేల విలువ గల చెక్కులు మంజూరయ్యాయి.
మంజూరైన చెక్కులను ఆదివారం బాధితుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.