షాబాద్ : బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. గురువారం షాబాద్ మండలంలోని హైతాబాద్, సంకెపల్లిగూడ, షాబాద్, గొల్లూరుగూడ గ్రామాల్లో కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేయడం జరుగుతుందన్నారు.
శంకర్పల్లి మండలంలో..
శంకర్పల్లి : మండలంలోని గ్రామాల్లో గురువారం పార్టీ పిలుపు మేరకు టీఆర్ఎస్ జెండా పండుగను నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్లో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్ రవిందర్ జెండా ఎగుర వేశారు.
మొయినాబాద్లో..
మొయినాబాద్ : పార్టీ శ్రేణులు ఉత్సాహంగా టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలో పార్టీ మండల అద్యక్షుడు మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, మహిళా కమిటీ జిల్లా అధ్యక్షురాలు స్వప్న, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు జెండాను ఆవిష్కరించారు.