చేవెళ్లటౌన్ : బంగారు మైసమ్మ బోనాలు చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి మైసమ్మ తల్లికి పూజాలు చేశారు. భక్తులు దేవాలయాలకు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళ భక్తులు బోనాలతో ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఆలయం చుట్టు ప్రదక్షణలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. బోనాల ఊరేగింపు ముందు పోతురాజుల విన్యాసాలు, డోలు, డప్పు వాయుద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే విధంగా చేవెళ్ల గ్రామం నుంచి కుమ్మెర గేటు వద్ద ఉన్న బంగారు మైసమ్మ దేవాలయం వరకు పలారం బండి ఊరేగింపుగా తీసుకెళ్లారు.