కడ్తాల్ : మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్యదైవమైన కాటమయ్య స్వామి బోనాలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, హరతీ, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామంలోని ప్రధాన వీధులగుండా మహిళలు బోనాలను ఊరేగించి, ఆలయంలో నైవేద్యాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్యగౌడ్, యాదయ్యగౌడ్, నారాయణగౌడ్, సుధాకర్గౌడ్, మల్లేశ్గౌడ్, శ్రీనివాస్గౌడ్, శ్రీరాములుగౌడ్, యాదగిరిగౌడ్, గణేశ్గౌడ్, వెంకటేశ్గౌడ్, మహేశ్గౌడ్, నర్సింహ్మగౌడ్, శివగౌడ్, విజయ్గౌడ్, రాజేశ్గౌడ్, శేఖర్గౌడ్, రాజేందర్గౌడ్, మహిళలు పాల్గొన్నారు.