మొయినాబాద్ : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈసీ వాగు పరవల్లు తొక్కుతుంది. ఈసీ వాగులోని అందాలను ఆస్వాదించడానికి ప్రజలు వాగు సమీపంలోనికి చేరుకుంటున్నారు. వాగులో ఉన్న రాళ్లు గుట్టల మీద కూర్చుని ప్రకృతి అందాలను, గంగమ్మ తల్లి పరవళ్లును తిలకిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపూర్ సమీపంలో నిర్మించిన కత్వ వద్ద నీటి ప్రవాహం ఎంతో అందంగా ఉండటంతో దానిని చూడటానికి చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకుంటున్నారు. కత్వ వద్ద ఈసీ వాగులో ఉన్న రాళ్ల మీద కూర్చుని వరద ప్రవాహన్ని చూసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.