శంకర్పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడితే జరిమానాలు విధిస్తామని మున్సిపల్ కమిషనర్ యాదగిరి హెచ్చరించారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్, కిరాణా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు జరిగితే రూ. 500ల నుంచి రూ. 5వేల వరకు జరిమానా విధిస్తామని చెప్పారు. కాగా ఎంఎం ఫ్యాషన్ దుకాణంలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడడంతో దుకాణా దారునికి రూ. 3వేల జరిమానా విధించారు. కార్యక్రమంలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.