తలకొండపల్లి : సమాజంలో ప్రతి ఒక్కరూ సోదరభావంతో నమ్మకంతో కలిసి ఉంటూ దైవచింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని రామకృష్ణాపూర్లో సింగిల్విండో చైర్మన్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో హోమంతో పాటు అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్సీని సింగిల్విండో చైర్మన్ కేశవరెడ్డి సన్మాణించారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ కేశవరెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ శ్రీశైలం, మాజీ సర్పంచ్ విఠలయ్య, పీఎసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, అమర్రెడ్డి, రంగారెడ్డి, ఎలమందారెడ్డి పాల్గొన్నారు.