కడ్తాల్ : సమాజంలో ప్రతి ఒక్కరూ దైవభక్తి అలవర్చుకోవాలని శ్రీశైల సూర్య సింహాసన పీఠాధీపతి జగద్గురు సిద్ధారామ మహా స్వామిజీ అన్నారు. శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని మిర్యాణం శరుణుబసప్ప నివాసంలో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావనతో నడుచుకోవాలని, భక్తితో ఉంటే మంచి పనులు చేయాలనే ఆలోచనలు వస్తాయని తెలిపారు.
నిత్యం భగవంతుడిని స్మరించడంతో ప్రతి ఒక్కరి జీవనం సుఖసంతోషాలతో వర్ధిలుతుందన్నారు. భగవంతుడి ముందు అందరూ సమానమేనని, ప్రతి ఒక్కరూ ధర్మాన్ని కాపాడాలని అన్నారు. అనంతరం మండల వీరశైవ లింగాయత్ సభ్యులు స్వామి వారిని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సభ్యులు మల్లప్ప, సర్వేశ్వర్, వెంకటేశ్, అంజయ్య, మల్లేశ్, సంతోశ్కుమార్, శాంతికుమార్ పాల్గొన్నారు.