కడ్తాల్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవా లని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను, గురువారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణలో ఉన్నదన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ టీకా ఇప్పించుకోవాలని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్లు వేయించడానికి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ను చేపట్టిందన్నారు. కరోనా టీకాపై ఎవరూ అపోహ పడొద్దని, వ్యాక్సిన్ ధైర్యంగా వేయించుకోవాలన్నా రు. కల్వకుర్తి నియోజకవర్గలోని 165 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాల్టీల్లో కరోనా వ్యాక్సిన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళ సంఘాల సభ్యులు ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీటీసీలు శ్రీనివాస్రెడ్డి, గోపాల్, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు భిక్షపతి, గణేశ్గౌడ్, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్, కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, నాయకులు చందోజీ, గంప శ్రీను, జహంగీర్అలీ, నర్సింహా, లాయక్అలీ, రవీందర్రెడ్డి, అశోక్రెడ్డి, కృష్ణ, ఇర్షాద్, నాగార్జున్, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో తేజ్సింగ్, మండ ల వైద్యాధాకారి ఆజీమ్, ఎంపీహెచ్ఈఓ ప్రవీణ్రెడ్డి, ఏఎన్ఏంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.