వెంగళరావునగర్, మే 3: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి ఆహర్నిశలు కృషిచేస్తున్నదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం సోమాజిగూడ డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ, ఇమామ్గూడ, వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని జవహర్నగర్ మసీదు వద్ద పేద ముస్లింలకు ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా కిట్లను స్థానిక కార్పొరేటర్లు వనం సంగీత యాదవ్, దేదీప్యలతో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక గురుకులాలు, షాదీ ముబారక్, అర్హులై ముస్లింలకు సబ్సిడీ రుణాల పథకాల అమలుతో పాటు రిజర్వేషన్ల పెంపు కోసం కేసీఆర్ సర్కార్ కృషి చేస్తున్నదన్నారు. కరోనా సమయంలో కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మసీదులో రంజాన్ కానుకలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, తన్నుఖాన్, వెంగళరావునగర్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శ్యాంరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బంజారాహిల్స్, మే 3: అన్ని మతాలను సమదృష్టితో చూస్తున్నది దేశంలో ఒక టీఆర్ఎస్ ప్రభుత్వమేనని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్నగర్ డివిజన్ పరిధిలో పేద ముస్లింలకు రంజాన్ కానుకల పంపిణీని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సీఎన్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ, మే 3: బోరబండ డివిజన్లో మైనార్టీలకు రంజాన్ కానుకలను ఎమ్మెల్యే గోపీనాథ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ సోమవారం పంపిణీ చేశారు. సైట్-1 కాలనీ అక్బరీ మసీదు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 500 కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి అని అన్నారు. మతాలకు అతీతంగా రంజాన్, క్రిస్మస్ కానుకలు, బతుకమ్మ చీరెలను అందిస్తున్న ఘనత దేశం మొత్తం మీద టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, నేతలు రమేశ్ రానాయక్, ఖలీల్, షేక్ వలీ, శంకర్నాయక్, ధర్మ, ఫయాజ్ఖాన్, సత్తార్, యూసుఫుద్దీన్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.
బన్సీలాల్పేట్, మే 3 : డివిజన్లోని బండమైసమ్మ బస్తీలో నివసించే పేద ముస్లింలకు బన్సీలాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ కుర్మ హేమలత ప్రభుత్వం తరఫున రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. సోమవారం మల్టీపర్పస్ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కె.లక్ష్మీపతి, రజాక్, రుక్ముద్దీన్, ముకర్రం, అబ్బాస్, శాబుద్దీన్, రాజు, మురళి, దాస్, సాయి, ఏసూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.